వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ జట్టు 68.1 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కవీస్ 44 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 137 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. లాథమ్ 11 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్లో రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బ్లండెల్ 30 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విలియమ్ సన్(61), టైలర్(28)పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. రెండో వికెట్ పై విలియమ్, టైలర్ 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ బ్యాట్స్మెన్లలో రహానే (46), అగర్వాల్(34), షమీ(21), పృధ్వీ షా(16), పూజారా(11) మిగతా బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కివీస్ బౌలర్లలో సౌథీ, జమ్సీన్ చెరో నాలుగు వికెట్లు తీయగా బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.
New zealand score 78 runs for 2 Wickts in 1st test