హామీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టి-20లో భారత జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. కివీస్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రోహిత్ 65 పరుగులు చేసి బెనెట్ బౌలింగ్లో సౌథీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 38 పరుగులు చేసి బెనెట్ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. కెఎల్ రాహుల్ 27 పరుగులు చేసి గ్రాండ్ హోమ్ బౌలింగ్లో మన్రోకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. దూబే మూడు పరుగులు చేసి బెనెట్ బౌలింగ్లో సోధీకి క్యాచ్ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ 17 పరుగులు చేసి శాంట్నార్ బౌలింగ్లో సీఫర్ట్కు క్యాచ్ ఇచ్చాడు వెనుదిరిగాడు. భారత బ్యాట్స్ మెన్లలో పాండే (14), జడేజా (10) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. కివీస్ బౌలర్లలో బెనెట్ మూడు వికెట్లు పడగొట్టగా గ్రాండ్ హోమ్, శాంట్నార్ చెరో ఒక వికెట్ తీశారు.