Friday, March 29, 2024

మూడేళ్ల తర్వాత తిరిగి బాలీవుడ్‌కి

- Advertisement -
- Advertisement -

Nidhi Agarwal Back to Bollywood after three years

 

టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘మున్నా మైఖేల్’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిధి అగర్వాల్. ఈ మూవీ కోసం మొత్తం 300 మందిని ఆడిషన్ చేస్తే అందులో ఫైనల్‌గా నిధి అగర్వాల్‌ని ఆ అదృష్టం వరించింది. ఈ మూవీ 2017లో విడుదలైంది. ఆ తరువాత బాలీవుడ్‌ని వదిలేసి టాలీవుడ్ బాటపట్టింది నిధి అగర్వాల్. సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాల్లో నటించింది ఈ భామ. కానీ నిధికి ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించింది. ప్రస్తుతం తమిళంలో శింబుతో ఓ ఫిల్మ్ చేస్తున్న నిధి తెలుగులో మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్నప్పటికీ మళ్లీ ఈ భామ బాలీవుడ్ బాట పట్టాలనుకుంటోంది. మూడేళ్ల విరామం తరువాత బాలీవుడ్‌లో నిధి క్రేజీ ఆఫర్‌ని దక్కించుకుంది. ప్రస్తుతం చేస్తున్న తెలుగు, తమిళ చిత్రాలు పూర్తి చేసిన తరువాత హిందీ చిత్రం కోసం బాలీవుడ్‌కు వెళ్లనుంది ఈ బ్యూటీ. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని నిధి అగర్వాల్ పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News