Thursday, April 25, 2024

యుపిలోని రెండు జిల్లాల్లో ఏప్రిల్ 17 వరకు రాత్రిపూట కర్ఫ్యూ

- Advertisement -
- Advertisement -

night curfew in two districts of UP till April 17

నోయిడా/ఘజియాబాద్(యుపి): కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఢిల్లీకి పొరుగున ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధ నగర్(నోయిడా), ఘజియాబాద్ జిల్లాలలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. గురువారం రాత్రి నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని గురువారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఈ ఆంక్షల నుంచి నిత్యావసర సరుసల రవాణాను, వైద్య, ఇతర నిత్యావసర సర్వీసులను మినహాయించినట్లు ఈ రెండు జిల్లాల కలెక్టర్లు జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాలలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ విద్యా సంస్థలు(వైద్య, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీలకు మినహాయింపు), కోచింగ్ సెంటర్లు ఏప్రిల్ 14 వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ప్రాక్టికల్స్‌తో సహా అన్ని పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, ఈ ఉత్తర్వుల నుంచి వీటిని మినహాయించామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

night curfew in two districts of UP till April 17

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News