- Advertisement -
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి వైద్యుడిపై నిమ్స్ రెసిడెంట్ వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లికి ఒప్పుకోలేదని తనను సోషల్ మీడియాలో వేధిస్తున్నాడంటూ వైద్యురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు వైద్యుడు సిద్ధార్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ లో సిద్ధార్థ పరిచయం అయ్యాడని ఆమె తెలిపింది. కొంతకాలం తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. సిద్ధార్థ పెళ్లి ప్రతిపాదనను తాను తిరస్కరించినట్టు వైద్యురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని పంజాగుట్ట పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
NIMS Doctor Complaint Against Osmania Doctor
- Advertisement -