- Advertisement -
నాగర్ కర్నూల్: హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం వ్యాన్ లో శ్రీశైలం వెళ్తుండగా నాగర్ కర్నూల్ జిల్లా ఈగటపెంటలోని శ్రీశైలం ఘాట్ రోడ్డు పైనుంచి వారి వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి వారిని ఈగలపెంట జెన్ కో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. బాధితులు హైదరాబాద్ లోని ధూల్ పేట ప్రాంతానికి చెందిన కుటుంబంగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాన్ని డ్రైవర్ అతివేగంగా నడపడంతో పాటు నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
- Advertisement -