Saturday, April 20, 2024

నింగిని చూసి నేర్చుకున్న…

- Advertisement -
- Advertisement -

Ningini chusi nerchukunna song release from Chitrapatam

 

సినీ గీత రచయితగా తనకంటూ ఓ ఫ్రత్యేక గుర్తింపు పొందిన బండారు దానయ్య కవి ఇదివరకే దర్శకుడిగా మారారు. తన అభిరుచిని చాటుకుంటూ ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘చిత్రపటం’. పార్వతీశం, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులు. శ్రీ క్రియేషన్స్ పతాకంపై పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ‘నింగిని చూసి నేర్చుకున్న…‘ అనే పల్లవితో సాగే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.

అనంతరం విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ మంచి కథ, మంచి టైటిల్, చక్కటి సాహిత్యం, సంగీతం మేళవింపు ఈ చిత్రమని దర్శక, నిర్మాతలను, చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ “ఇంటర్నెట్ లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి. దొరకనిదల్లా ఎమోషన్ మాత్రమే. దాన్ని ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం. తండ్రికీ, కూతురికి మధ్య సాగే కథతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఏడు పాటలు ఉన్నాయి. వాటికి నేనే సాహిత్యం అందించడంతో పాటు సంగీతాన్ని సమకూర్చాను” అని అన్నారు. నిర్మాత పుప్పాల శ్రీధర్ మాట్లాడుతూ త్వరలో ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News