Friday, April 19, 2024

నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Niranjan reddy tested corona positive

హైదరాబాద్: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. తనని కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ల సలహా మేరకు హోక్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని పేర్కొన్నారు. దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. తెలంగాణలో గత మూడు రోజులు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండి గత 24 గంటల్లో 2251 మందికి కరోనా వైరస్ సోకింది. మాస్కు పెట్టుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించాలని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News