నితిన్, రకుల్ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’. ఈ చిత్రం ఈనెల 26న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్ర దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ “నేను చాలా రోజులు తర్వాత థియేటర్కు వెళ్లి చూడాలని ఫీలైన చిత్రం ‘చెక్’. ఈ సినిమా కాన్సెప్ట్ అలాంటిది. ఈ సినిమాలో చెస్ కథను నేపథ్యంగా తీసుకోవడం, సినిమా అంతా జైలులోనే తీయడం ఆసక్తి కలిగించింది. చెక్ సినిమా క్లాస్, మాస్ అనే హద్దులను చెరిపివేస్తుంది. వైవిధ్యమైన ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందని బలంగా నమ్ముతున్నాను”అని అన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ “ చంద్రశేఖర్ యేలేటి లాంటి దర్శకుడితో చెక్ సినిమా చేయడం లక్కీగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు నా యాక్టింగ్ ఒక లెక్క.. ‘చెక్’ తర్వాత మరో లెక్క” అని చెప్పారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ “నితిన్ ఫ్యాన్స్కు ఒక్కటే చెప్పదలచుకొన్నాను. చెక్ సినిమా ఎవరినీ నిరాశ పరచదు”అని అన్నారు. వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “నాకు ఇష్టమైన డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి, యూత్ఫుల్ హీరో నితిన్ కాంబినేషన్లో ‘చెక్’ మూవీని నిర్మించాం. నితిన్కు ఎప్పటికీ గుర్తుంచుకొనే చిత్రంగా ఇది మిగిలిపోతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపిచంద్ మలినేని, ప్రియా ప్రకాశ్ వారియర్, మిర్చి సంపత్, అన్నే రవి, వరంగల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Nithin’s Check Movie Pre Release Event