- Advertisement -
హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్ర 4గంటల వరకు 98.42శాతం పోలింగ్ నమోదైంది. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో కల్వకుంట్ల కవిత(టిఆర్ఎస్), సుభాష్ రెడ్డి(కాంగ్రెస్), లక్ష్మీనారాయణ(బిజెపి) బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో జరిగింది. ఎక్స్ అఫీషియా సభ్యులు, ప్రజాప్రతినిధులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎక్స్ అఫీషియా సభ్యులుగా ఎంఎల్ఎలు, ఎమ్మెల్సీలు ఓటు వేశారు. కోవిడ్ మార్గర్శకాలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 12న నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.
Nizamabad MLC polling ended
- Advertisement -