- Advertisement -
లక్నో : అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికల్లో బిజెపితో జతకట్టే ప్రసక్తే లేదని ఈ రెండు పార్టీల సిద్ధాంతాల మధ్య తీవ్ర వైరుధ్యం ఉన్నందున పొత్తు అన్నది కుదరదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి సోమవారం స్పష్టం చేశారు. సమాజ్వాది పార్టీ అభ్యర్థులను ఓడించడానికి అవసరమైతే బిజెపికి కానీ లేదా మరే పార్టీకి ఓటు వేస్తాం తప్ప సమాజ్వాది అభ్యర్థులకు ఓటు వేసేది లేదని గత వారం ఆమె చేసిన ప్రకటన అనేక ఊహాగానాలకు దారి తీయడంతో ఆమె వివరణ ఇచ్చారు. తాను చేసిన ప్రకటనను సమాజ్వాది, కాంగ్రెస్ పార్టీలు ఇంకోలా ఉపయోగించి ముస్లిం సమాజం బిఎస్పికి దూరం అయ్యేలా ప్రయత్నిస్తున్నాయని ఆమె ధ్వజమెత్తారు. తమ పార్టీ సిద్ధాంతం సర్వజన్ సర్వధర్మ హితయ్ గా ఆమె అభివర్ణించారు. మతపరమైన, కులపరమైన పెట్టుబడిదారీ సిద్ధాంతాలున్న ఏ పార్టీ తోనూ బిఎస్పి మిత్రత్వం నెరపదని ఆమె పేర్కొన్నారు.
- Advertisement -