- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో 80 శాతం మందికి కరోనా ఉన్న లక్షణాలు లేవని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా కరోనా ట్రీట్మెంట్ ఉచితంగా ఇచ్చామన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 36221 కేసులు నమోదు చేశామన్నారు. సోమవారం ఒక్క రోజే 11525 టెస్టులు చేశామని తెలియజేశారు. దేశంలో 2.7 శాతం డెత్రేట్ ఉంటే తెలంగాణలో ఒక్క శాతమే ఉందన్నారు. తెలంగాణలో 99 శాతం రికవరీ ఉందని, హైదరాబాద్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, జిహెచ్ఎంసి పరిధిలోని 300 ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు చేశామని, 9786 మంది హోంఐసోలేషన్లో ఉన్నారని శ్రీనివాస్ వెల్లడించారు.
- Advertisement -