- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డు నుంచి ఏ కరోనా బాధితుడు పారిపోలేదని చిలకలగూడ సిఐ బాలగంగిరెడ్డి స్పష్టం చేశారు. బాత్రూం అని చెప్పివెళ్లిన గద్వాలకు చెందిన బాధితుడు హాస్పిటల్లోని మరో వార్డుకి వెళ్లాడని, దాంతో అతడున్న వార్డుకి తిరిగి రాకపోవడంతో పారిపోయినట్లు తప్పుడు ప్రచారం జరిగిందని సిఐ చెప్పారు. ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్ వార్డులోకి పంపించామని, గాంధీ ఆస్పత్రిలో బందోబస్తు పకడ్బందీగా ఉందని సిఐ తెలిపారు. కాగా, ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన చాలా మందికి కరోనా సోకడంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే కరోనాతో 11మంది చనిపోయారు.
No one Corona Patient Escape from Gandhi Hospital
- Advertisement -