Thursday, April 25, 2024

‘నో పెళ్లి’ అంటున్న సాయి ధరమ్.. రానా, వ‌రుణ్ సందడి..

- Advertisement -
- Advertisement -

 

‘ప్రతిరోజూ పండగే’ సినిమా తర్వాత మెగా మేనల్లుడు, సుప్రీమ్  హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. కొత్త దర్శకుడు సుబ్బు తెరకెకి్కుతున్న ఈ మూవీని ఎస్ విసిసి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి తేజ్ సరసన తొలిసారి ‘ఇస్మార్ట్’ పోరి నభా నటేష్ నటిస్తుంది. తాజా చిత్రంలోని తొలి పాట నో పెళ్లి అంటూ సాగే పాట‌ని యంగ్ హీరో నితిన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఈ పాట‌లో రానా, వ‌రుణ్ తేజ్ కూడా సందడి చేశారు. తమన్ సంగీతం సారథ్యంలో అర్మాన్ మాలిక్ పాడిన ఈ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంది. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

No Pelli song released from SBSB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News