- Advertisement -
ఖమ్మం: రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కల్లూరు మండలం కొర్లగూడెంలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎరువులు, విత్తనాలకు కొరత లేదని, రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు చర్చించుకునేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడుతాయని వివరించారు. సిఎం కెసిఆర్ నిర్ణయాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వర్ రావు, ఎంఎల్ఎ సండ్ర వెంకటవీరయ్య, జడ్పి చైర్మన్ కమల్ రాజ్ పాల్గొన్నారు.
- Advertisement -