Friday, March 29, 2024

గన్నీల కొరత లేనేలేదు: గంగుల

- Advertisement -
- Advertisement -

వానాకాలం ధాన్యం సేకరణపై మంత్రి గంగుల ఉన్నత స్థాయి సమీక్ష

జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభమైన 1033 కొనుగోలు కేంద్రాలు

అవసరమైన చోట తక్షణ ఏర్పాటుకు కలెక్టర్లకు ఆదేశాలు

గన్నీల కొరత లేనేలేదు

కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో గన్నీలు, వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు

పూర్తైన ట్రాన్ప్ పోర్ట్ ఏర్పాట్లు

పౌరసరఫరాల అంశాలను పర్యవేక్షించేందుకు ఐటీ విబాగం బలోపేతం

No shortage of gunny bags

హైదరాబాద్:  రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 వానాకాలం ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.  హైదరాబాద్ లోని తన కార్యాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లైస్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ శాఖా పరంగా చేసిన ఏర్పాట్లను మంత్రికి అధికారులు వివరించారు.

గన్నీల అందుబాటు, ట్రాన్స్ పోర్టు ఏర్పాట్లు, అకాల వర్షాలనుండి ధాన్యం తడవకుండా టార్పాలిన్ల ఏర్పాటుపై మంత్రి అధికారులకు అధేశాలు జారీచేశారు. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా 1033 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, పంట కోతలు పూర్తైన ప్రాంతాల్లోనూ అవసరమైన చోట తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చామన్నారు.

ధాన్యంకు సరిపడా గన్నీలు అందుబాటులో ఉన్నాయని, రైతుసోదరులు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఎలాంటి దుష్రచారాలను పట్టించుకోవద్దని గంగుల సూచించారు. కొనుగోలు పూర్తైన తర్వాత తరలించడానికి ట్రాన్స్ పోర్టు సదుపాయాలు కూడా పూర్తిగా సిద్దంగా ఉన్నాయని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. సివిల్ సప్లైస్ శాఖలోని ఐటి వింగ్ మరింత బలోపేతం చేసి దాని ద్వారా శాఖపరమైన అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకు సంబందించిన కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News