Friday, April 19, 2024

ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రసుత్తం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైసిపి ఎంపి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించింది. జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సంబంధించి 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపలేదు. ప్రణాళిక, ప్రణాళికేతర కింద రాష్ట్రాల అవసరాల మేరకు నిధులు బదలాయించేందుకు 14వ ఆర్థిక సంఘం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంది.

ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే 2015-20 మధ్య రాష్ట్రాలకు పంచే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి కేంద్రం పెంచింది. దీనికి కొనసాగింపుగా 15వ ఆర్థిక సంఘం కూడా 41 శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసింది. నిధుల పంపిణీ ద్వారా వీలైనంత మేరకు ప్రతి రాష్ట్రానికి వనరులు అందించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. నిధుల పంపిణీ తరువాత కూడా వనరుల లోటు ఉండే రాష్ట్రాలకు.. రెవెన్యూ లోటు పూడ్చేందుకు గ్రాంట్స్ అందిస్తోంది‘ అని కేంద్ర మంత్రి తెలిపారు.
గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమే
నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై రాజ్యసభలో వైసిపి ఎంపి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు సమాధానం ఇచ్చారు. పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతోందా అని ఎంపి ప్రశ్నించగా.. షెడ్యూల్ ప్రకారం 2024 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. కానీ, వివిధ కారణాల దృష్ట్యా ఈ గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని స్పష్టం చేశారు. చెల్లించాల్సిన బ్యాలెన్స్ రూ.2,441.86 కోట్లు మాత్రమేనని కేంద్ర మంత్రి తెలిపారు.

‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2019 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రూ.6,461.88 కోట్లు ఎపి ప్రభుత్వానికి విడుదల చేసింది. 2013-14 అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం రూ.29, 027.95 కోట్లు. 2017-18. అంచనాల ప్రకారం రూ. 47.725.74 కోట్లకు పెరిగింది. 2016లో కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం మేరకు వంద శాతం ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులను కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. ఇందులో భాగంగా కేంద్ర ం చెల్లించాల్సిన మొత్తం రూ. 15.667.90 కోట్లు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News