Saturday, April 20, 2024

ఈటెలకు ఎలాంటి ప్రాణ భయం లేదు: గంగుల

- Advertisement -
- Advertisement -

No threat to etela rajender said by Gangula

 

కరీంనగర్: మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ ప్రాణాలకు ఎలాంటి భయం లేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హుజురాబాద్ లో ఈటెల పాదయాత్ర చేస్తున్న సందర్భంగా తనకు ప్రాణాపాయం ఉందని కామెంట్లకు గంగుల రీ కౌంటర్ ఇచ్చారు. ఈటెలతో మాకు ఎలాంటి పంచాయతీ లేదన్నారు. తెలంగాణలో భౌతిక దాడులు, హత్యల సంస్కృతి లేదన్నారు. ఈటెల కామెంట్స్‌పై వెంటనే విచారణ జరిపించాలని డిజిపి కోరుతున్నామన్నారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేకపోతే కేంద్ర సంస్థలతోనే విచారణ జరిపించాలని కోరారు. తన మనుషులతోనే దాడి చేయించుకొని ప్రభుత్వంపై నెట్టివేయాలని ఈటెల చూస్తున్నారని విరుచుకపడ్డారు. ఓట్ల కోసమే దాడులు చేస్తారంటూ మాట్లాడుతున్నారన్నారు. ఈటెలపై దాడి చేయించే మంత్రి ఎవరో చెప్పాలని గంగుల నిలదీశారు. తాను తప్పు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News