Friday, April 19, 2024

ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైన సిద్దిపేట జిల్లా

- Advertisement -
- Advertisement -

Nominated for Siddipet Prime Minister Award-2019

జాతీయ స్థాయిలో సిద్దిపేటకు మరో గుర్తింపు…

మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవకు నిదర్శనం…

సిద్దిపేట జిల్లాకు ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ మిషన్ ఇంద్ర ధనుష్ కేటగిరీలో ఎంపిక ..

చిన్నారులకు వంద శాతం టీకాలు పూర్తి చేసిన జిల్లాగా రికార్డు..

హర్షం వ్యక్తం చేసిన వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట: చిన్నారులకు వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయడం లక్ష్యంలో భాగంగా ప్రారంబించిన మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమం అమలులో సిద్దిపేట జిల్లా సత్తా చాటింది. వివిధ కారణాల వల్ల వ్యాక్సిన్లు వేసుకోలేని చిన్నారులను గుర్తించి, వారందరికీ వ్యాక్సిన్లు పంపిణీ చేయడంలో అధికారులు, సిబ్బంది మంచి ఫలితాలు సాధించారు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్ర ధనుష్ కేటగిరీలో సిద్దిపేట జిల్లాను ప్రైమ్ మినిస్టర్ అవార్డ్-2019కి ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 20-21న ఢిల్లీలో జరిగే “సివిల్ సర్వీసెస్ డే” కార్యక్రమంలో ట్రోపీతో పాటు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాకు అందిస్తుంది. సిద్దిపేట జిల్లాకు ఈ అవార్డు రావడం పట్ల ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. రాష్ట్రంలోని ప్ర‌తిచిన్నారికి వంద శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి చేసేలా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో వైద్యారోగ్య శాఖ కృషి చేస్తున్న‌ద‌న్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News