Tuesday, April 16, 2024

ఇప్పుడే బూస్టర్ డోసు అనైతికం : సీరం సిఇఒ పూనావాలా

- Advertisement -
- Advertisement -

Now booster dose is unethical: Serum CEO

న్యూఢిల్లీ : ఇప్పటికీ పలు చేశాల్లో పూర్తి వ్యాక్సినేషన్‌కు కరోనా టీకాలు అందుబాటులో లేవని, ఈ సమయంలో బూస్టర్ డోసును ప్రారంభించడం అనేతికమేనని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఒ అదర్ పూనావాలా అన్నారు. ఇప్పటికే కొన్ని సంపన్న దేశాలు బూస్టర్ డోసు పంపిణీని మొదలు పెట్టగా, మరికొన్ని దేశాలు ఆ దిశగా ప్రణాళికలు రచిస్తోన్న సంగతి తెలిసిందే. అభివృద్ధి చెందుతున్న దేశాలు కేవలం 2 నుంచి 3 శాతం మాత్రమే టీకాలు పొందాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సినేషన్ రేటు 40 నుంచి 50 శాతంగా ఉంది. ఈ సమయంలో బూస్టర్ డోసు సరికాదు. ప్రపంచ దేశాలు గణనీయమైన స్థాయిలో రెండు డోసులు పొందిన తరువాత , అప్పుడు బూస్టర్ డోసు ఇవ్వడం గురించి ఆలోచించాలని పూనావాలా అన్నారు.

బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ అభిప్రాయం వెలిబుచ్చారు. వైరస్ ముప్పు పొంచి ఉన్న వ్యక్తులు, బలహీన రోగనిరోధక శక్తి ఉన్నవారికి మాత్రం ఈ డోసు ఇవ్వడం గురించి ఆలోచించవచ్చు. అలాగే కొవిషీల్డ్‌కు మూడో మోతాదు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లేవు. కొందరు ఈ డోసు తీసుకొని ఉండొచ్చు. మా నుంచి మాత్రం ఎలాంటి సిఫార్సు లేదు. డెల్టా వేరియంట్ పై వ్యాక్సిన్ ప్రభావం, కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఆ డోసుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని పాశ్చాత్య దేశాలు దీనిపై ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు మన లక్షం మాత్రం అందరికీ రెండు డోసులు టీకా ఇవ్వడమే. భారత్‌లో టీకా తయారీదారులు ఉండటం మనందరి అదృష్టం. లేకపోతే మన పరిస్థితి కూడా ఆఫ్రికా దేశాలు మాదిరి గానే ఉండేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News