Thursday, April 25, 2024

ఆ మేరకు స్క్రిప్ట్ రూపకల్పనలో స్టార్ డైరెక్టర్

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ – కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ (2017) బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి జతకడుతోంది. ప్రస్తుతం కొరటాల… మెగాస్టార్ చిరంజీవి హీరోగా ’ఆచార్య’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గత రెండేళ్లుగా కొరటాల ఇదే సినిమాపై పనిచేస్తున్నాడు. గత ఏడాది విడుదల కావాల్సిన ఆచార్య సినిమా.. కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి వాయిదాపడుతూ వస్తోంది. ఆఖరికి ఈ ఏడాది మే 13న ఆచార్య సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ ఈసారి కరోనా సెకండ్ వేవ్ వచ్చేసరికి మళ్లీ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ‘ఆచార్య’ చివరిదశలో ఉంది. ఈ సినిమా తర్వాత కొరటాల తదుపరి సినిమాల విషయంలో ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే షూటింగ్ లేని ఈ సమయాన్ని ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ కోసం కేటాయిస్తున్నాడట. కానీ ఈసారి స్క్రిప్ట్‌లో భారీ మార్పులు కనిపించనున్నాయని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్… రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతోంది. అంటే ఇకపై ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేసే అవకాశం ఉంది. అయితే రాబోయే పాన్ ఇండియా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కొరటాల బృందం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు టాక్. మరి కొరటాల ప్రాజెక్ట్ అంటే కాస్తో కూస్తో సందేశత్మకంగా ఉంటాయి. మరి ఈసారి ఎలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీయనున్నాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులోను ఇటీవలే సినిమా ప్రకటనతో పాటు 2022 ఏప్రిల్ 22న సినిమా రిలీజ్ అని డేట్ కూడా ప్రకటించారు. చూడాలి మరి కొరటాల పాన్ ఇండియా ఎంట్రీ ఎలా ఉండబోతుందో.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News