హీరో పాత్రను దర్శకుడు తీర్చిదిద్దే విధానంలోనే ఉంటుంది సక్సెస్. ఈ నేపథ్యంలో ‘కెజిఎఫ్’ సినిమాలో రాఖీభాయ్గా యష్ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు ప్రశాంత్ నీల్ కే దక్కుతుంది. కో లార్ బంగారు గనుల్లో మాఫియా కథను ఎంచుకొని ‘కెజిఎఫ్’ను ఆయన అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్ 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. అతను ఇప్పటికే పలుమార్లు తారక్తో స్క్రిప్ట్ గురించి చర్చించాడు. ఇందులో ఎన్టీఆర్ పాత్రను దర్శకుడు ఎంతో యూనిక్గా తీర్చిదిద్దుతున్నాడని తెలిసింది. తారక్ పాత్ర తీరుతెన్నులు ‘కెజిఎఫ్’లో రాఖీ భాయ్ని మించేలా ప్రశాంత్ నీల్ డిజైన్ చేస్తున్నాడట. ఇక ఇందులో ఎన్టీఆర్ మరో లెవెల్లో కనిపిస్తాడని చెబుతున్నారు. తారక్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ లో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తన కెరీర్ బెస్ట్ అని భావిస్తుంటే .. అంతకు మించి చూపించేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక త్రివిక్రమ్ సినిమాలోనూ మరో విలక్షణమైన పాత్రలోనే ఎన్టీఆర్ కనిపిస్తాడని తెలిసింది.