18 వరకు కొనసాగింపు, సుమారు 17లక్షల జనం సందర్శన
నాంపల్లి : నుమాయిష్ సందర్శకులకు శుభవార్త నాంపల్లిలో జరుగుతున్న అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనను మరో మూడు రోజులపాటు పొడిగించారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ సొసైటీ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమై ఈనెల 18 వరకూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ దఫా కొత్త ఎడాది 1 తేదీ నుంచి ప్రారంభమైన నుమాయిష్ వరసగా 46 రోజులపాటు సజావుగా విజయవంతంగా సాగింది. ఇక మూడురోజులపాటు అదనంగా నుమాయిష్కు దేశ విదేశీ సందర్శకులు వస్తారు.
ఈదఫా ఎలాంటి అపశృతులు, ఘటనలు జరగకుండా సాగింది. నుమాయిష్లో స్టాళ్లను ఆలస్యంగా ప్రారంభించడం, ఆశించిన విధంగా వ్యాపారాలు సాగకపోవడం ఇతరాత్ర ఇబ్బందులను ఏకరువుపెడుతూ ఎగ్జిబిషన్ సొసైటీకి వినతి చేశారు. అంతకుముందు వారు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలి పొడగించాలని కోరారు. ఏటా వివిధ కారణాల వల్ల నుమాయిష్ను అదనంగా పలు రోజులు పొడగింపు అనివార్యమవుతోంది.
ఈ మేరకు పోలీస్, ఫైర్ సర్వీస్, జలమండలి, విద్యుత్ తదితర సంస్థలు నో అబ్జేక్షన్ ధ్రవపత్రాలు ఇచ్చాయని తెలిసింది. ప్రజలు, వ్యాపారుల వత్తిడీ మేరకు అదనంగా మూడురోజులపాటు ఎగ్జిబిషన్ను పొడగించినట్లు సొసైటీ మేనేజింగ్ కమిటీ ప్రతినిధి మార్గం ఆశ్వీన్ వెల్లడించారు. గతరోజులుగా నూమాయిష్ను ఈనెల 14 తేదీ వరకూ సుమారు 17 లక్షల వరకూ జనం సందర్శించారని సొసైటీ వర్గాలు వెల్లడించాయి. ఇంకా మూడురోజుల పొడగింపు వల్ల దాదాపు లక్షల వరకూ ప్రజలు వస్తారన్నది వారి అంచనా.
Numaish is an extension for another three days