Saturday, April 20, 2024

ఉరి వేసుకుని నర్సు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Nurse commits suicide by hanging

 

హైదరాబాద్ : ఉరివేసుకుని నర్సు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….ఎపిలోని కాకినాడకు చెందిన కుమారి రజనీ(27) కొండపూర్‌లోని ఏఐజి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. కిమ్స్ నర్సుగా పనిచేస్తున్న తన సోదరి అనితతో కలిసి కొండాపూర్‌లో ఆర్టిఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఇంటిలో అద్దెకు ఉంటోంది. రోజు మాదిరిగానే విధులకు వెళ్లి వచ్చిన రజనీ ఇంట్లో ఉంది. బాధితురాలి సోదరి అనిత విధులు ముగించుకుని వచ్చి ఇంటి తలుపు కొట్టగా రజనీ తీయలేదు. దీంతో అనుమానం వచ్చి తాను ఇంటి డోర్ తీసుకుని లోపలికి వెళ్లి చూసేసరికి రజనీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంది. వెంటనే చుట్టపక్కల వారి సాయంతో కిందికి దింపి చూడగా రజినీ అప్పటికే మృతిచెంది ఉంది. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యల వల్లే రజినీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News