నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి దూకి 28 ఏళ్ల వయస్సున్న ఓ నర్సు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్లోని న్యూ మణినగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలు అహ్మదాబాద్లోని సివిల్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు తన భర్తతో కలిసి సిఎమ్టి ప్రాంతంలో నివాసం ఉండేది. అయితే, కొన్ని రోజుల నుంచి తన తండ్రితోనే న్యూ మణినగర్లో కర్నవటి రివేరా అపార్ట్మెంట్లోని పదవ అంతస్తులో ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం సదరు నర్సు బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గత రెండు, మూడు రోజులుగా తన కూతురు మెంటల్గా డిస్ట్రబ్ అయినట్లు కనిపించిందని నర్సు తండ్రి పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Nurse Jumps off to death from 10th floor in Ahmedabad