Thursday, April 25, 2024

నగరంలో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Nursing Student Committed Suicide At Secunderabad

హైదరాబాద్‌: సికింద్రాబాద్ లోని ఓ‌ ప్రయివేటు నర్సింగ్‌ కాలేజీకి చెందిన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మంగళవారం రాత్రి నర్సింగ్‌ కాలేజీ హాస్టల్‌లో చోటు చేసుకుంది. మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. మృతురాలిని నల్లగొండ జిల్లా మాల్‌కు చెందిన సౌందర్యగా పోలీసులు గుర్తించారు. విద్యార్థి మృతితో ఆమె నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Nursing Student Committed Suicide At Secunderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News