Tuesday, April 16, 2024

రెండో ఇన్నింగ్స్: మూడో వికెట్ కోల్పోయిన కివీస్..

- Advertisement -
- Advertisement -

NZ lost 3rd Wicket at 55 against IND in 2nd Test

ముంబయి: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. భారత్ నిర్ధేశించిన 539 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టును స్పిన్నర్ అశ్విన్ దెబ్బ కొట్టాడు. కెప్టెన్ టామ్ లాథమ్‌(6), విల్ యంగ్(20)లను ఔట్ చేసిన అశ్విన్.. రాస్ టేలర్(06)ను కూడా పెవిలియన్ పంపాడు. దీంతో 55 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కివీస్ ఒత్తిడిలో పడింది. ప్రస్తుత న్యూజిలాండ్ జట్టు 24 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో హెర్నీ నికోలస్(11), డారిల్ మిచెల్(32)లు ఉన్నారు.

NZ lost 3rd Wicket at 55 against IND in 2nd Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News