Saturday, April 20, 2024

తొలి వన్డేలో టీమిండియాపై కివీస్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

 

హామీల్టన్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కీవిస్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. దీంతో కివీస్, టీమిండియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాస్ టేలర్(109) అజేయ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. నికోలస్(78), లాథమ్(69)లు అర్థసెంచరీలతో రాణించారు.

అంతకుమందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రేయస్ అయ్యర్(103) సెంచరీతో మెరిశాడు. అయ్యర్ కెరీర్ లో తొలి వన్డే సెంచరీ ఇది. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లీ(51), కెఎల్ రాహుల్(88)లు అర్థ సెంచరీలతో రాణించారు.

NZ won by 4 wickets in 1st ODI against India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News