- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్బాపూజీ జయంతి వేడుకలను ఈ నెల 27న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జయంతి వేడుకలను అన్ని జిల్లాల కలెక్టర్లు, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ పేర్కొన్నారు.
- Advertisement -