- Advertisement -
వరంగల్: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న రోజే దంపతులు మృతి చెందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుట్టపాక వెంకటయ్య(67), అంజమ్మ(58) అనే దంపతులు కరోనా పరీక్ష చేయించుకునేందుకు ఏప్రిల్ 19న పిహెచ్ సికి వెళ్లారు. కరోనా టీకా తీసుకున్న అనంతరం అదే రోజు అంజమ్మ అస్వస్థతకు గురై మరణించింది. తీవ్ర మనోవేదనకు గురైన భర్త వెంకటయ్య శనివారం సాయంత్రం చనిపోయాడు. వృద్యాపంలో వచ్చే గుండెపోటుతో వారు మరణించి ఉంటారని పిహెచ్ సి వైద్యుడు రమేష్ కుమార్ తెలిపారు.
- Advertisement -