Friday, April 19, 2024

వృద్ధురాలును చంపి… మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: లైంగిక వాంఛ తీర్చకపోవడంతో వృద్ధురాలిని హత్య చేసి అనంతరం ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి రైలు పట్టాలపై పడేసిన సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అజ్మీరా నాజీ(70) మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి వద్ద ఒంటరిగా నివసిస్తోంది. ఆ వృద్ధురాలుపై అదేర్ల ఉపేందర్(45) కన్నేశాడు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ వృద్ధురాలును హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి బస్తాలో మూటకట్టాడు. తలను చీమలపాడు అటవీ ప్రాంతంలో కాల్చేశాడు. మొండాన్ని బస్తాలో వేసుకొని బైక్‌పై మరో యువకుడి సాయంతో తరలించేందుకు ఏర్పాట్లు చేశాడు. మూట నుంచి దుర్వాసన వస్తుండడంతో యువకుడి మూట విప్పి చూడగా మనిషి మృతదేహం అని అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉపేందర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వృద్ధురాలును చంపానని ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News