- Advertisement -
వ్యవసాయ పనులు కొనసాగుతున్న క్రమంలో ట్రాక్టర్ కిందపడి ఓ వృద్ధురాలు మృతి
మన తెలంగాణ/బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల పరిధిలోని వాజిద్నగర్ గ్రామ శివారులో పొలం పనులు చేస్తుండగా ట్రాక్టర్ కింద పడి వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వాజిద్నగర్ గ్రామంలోని తన పొలంలో వరికోత మిషన్ వడ్లు కోస్తుండగా ట్రాక్టర్ను డ్రైవర్ వెనుకకు తీస్తుండగా కమ్మరి లచ్చమ్మను ఢీకొట్టింది. ఆమెను స్థానికుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల, నడుము పై బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె కుమారుడు గంగారామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బిచ్కుంద ఎస్సై సాయన్న తెలిపారు.
- Advertisement -