Friday, March 29, 2024

న్యూఇయర్‌పై ఓమిక్రాన్ ఎఫెక్ట్…

- Advertisement -
- Advertisement -
Omicron Effect on new year celebrations
స్పెషల్ ఈవెంట్స్, పార్టీలకు
అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్నదానిపై సర్కార్ డైలమా…
కట్టడికి ప్రణాళిక సిద్ధం

హైదరాబాద్: ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో న్యూఇయర్ వేడుకలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొత్త సంవత్సరం ప్రారంభానికి ప్రతి ఏడాది నిర్వహించే స్పెషల్ ఈవెంట్స్, పార్టీలకు అనుమతి ఇవ్వాలా వద్దా? అని సర్కార్ డైలమాలో పడిందని తెలుస్తోంది. పార్టీలు, బార్లు, పబ్‌లు, స్టార్ హోటళ్లు, ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఏర్పడే జనసమూహాలతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదనేది ప్రభుత్వ ఆందోళనగా ఉంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా పరిసిథతులను గమనిస్తే కూడా మరో ముప్పు చూడాల్సి వస్తుందేమోనని ప్రజలతో పాటు అధికారులలోనూ భయాందోళనలు నెలకొని ఉన్నాయి. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. అంతేకాగా, క్మిస్మస్, సంక్రాంతి పండుగ వేడుకలకూ గ్రూప్ సమూహాలు కట్టడి చేసేందుకు ప్రణాళికను చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారులు, వైద్యశాఖ హెచ్‌ఓడిలు, ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నది. వివిధ శాఖలు, విభాగాలు, వారీగా కరోనా పరిస్థితులు, ముందస్తు కట్టడి చర్యలు, ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఒక్కో శాఖ నుంచి ప్రభుత్వానికి నివేదిక వెళ్లనుంది.

దాని ఆధారంగా న్యూయర్, ఇతర పార్టీలు, ఫంక్షన్లు, జన సమూహాల కార్యక్రమాల నియంత్రణ దిశగా ప్రభుత్వం అడగులు వేయనుంది. గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం కరోనా కేసులు నిలకడగా ఉన్నప్పటికీ కొత్తగా వచ్చిన వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఏకంగా ఆరు రెట్లు అదనంగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో గత ఏడాదిలానే ఆంక్షలు విధిస్తే బెటర్ అని కొందరు ప్రభుత్వ అధికారులు ప్రాథమిక అభిప్రాయాలను ప్రభుత్వానికి వివరించారు. గత సంవత్సరం లానే డిసెంబర్ 31వ తేదీన ఈవెంట్స్, రిసార్ట్, అపార్ట్‌మెంట్సు, గేటెడ్ కమ్యూనిటీలలో నూతన సంవత్సర వేడుకులకు అనుమతి ఇవ్వకుండా కట్టడి చేస్తే వ్యాప్తిని తగ్గించవచ్చని సీనియర్లు డాక్టర్లు, సైంటిస్టులు కూడా ప్రభుత్వానికి అంతర్గతంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నది. మరోవైపు డిసెంబర్ 31న రాత్రి మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జరిపితే కూడా కొంతవరకు మేలు జరుగుతుందని మరికొంతమంది అధికారులు ఇటీవల సెక్రటేరియట్‌లో జరిగిన ఉన్నతాధికారుల మీటింగ్‌లో అభిప్రాయాలను వెల్లడించారు. అయితే ప్రాథమికంగా ఆంక్షలు విధించే వైపే సర్కార్ మొగ్గుచూపే అవకాశం ఉంది. కానీ ఆంక్షలు విధిస్తే కేవలం హైదరాబాద్‌కు పరిమితం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News