Wednesday, April 24, 2024

మద్యం విక్రయాలకు బల్దియా గిరాకి

- Advertisement -
- Advertisement -

One Billion Liquor sales on one week in Hyderabad

 

వారం రోజుల్లో వెయ్యికోట్ల మద్యం అమ్మకాలు

మనతెలంగాణ/హైదరాబాద్‌ : ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక గ్రేటర్ పరిధిలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. బల్దియా పోరులో రాజకీయ పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాక మద్యానికి గిరాకీ పెరిగింది. ఈక్రమంలో ఈ నెల 23న రూ.135 కోట్లు, 24న రూ.107 కోట్లు, 25న రూ.102 కోట్లు, 26న రూ.58 కోట్లు, 27న రూ.170 కోట్లు, 28న రూ.176 కోట్లు, 29న రూ.108 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. జిహెచ్‌ఎంసి ఎన్నికల దృష్ట్యా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని, సాధారణ రోజుల్లో విక్రయాల కంటే 40శాతం అధికంగా జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రోజుకు వంద కోట్ల చొప్పున మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. 2019 నవంబరు 29 వరకు రూ.2,239 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.

ఈ ఏడాది అదే సమయంలో రూ.2,567 కోట్ల మద్యం విక్రయాలు జరుగగా, గతేడాదితో పోల్చితే దాదాపు రూ.500 కోట్ల విలువైన మద్యం అధికంగా విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఇదిలావుండగా నవంబరు 17 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో రూ.154 కోట్ల విలువైన మద్యం అమ్ముడైందని, ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో 317, మేడ్చల్ జిల్లాలో రూ. 42 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.100 కోట్ల లెక్కన మొత్తం రూ.615 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు వివరిస్తున్నారు. ఈక్రమంలో బల్దియా ఫలితాల అనంతరం రెండు రోజుల పాటు మద్యం విక్రయాలు అధికంగా జరిగే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి,రెండు రోజుల పాటు మద్యం విక్రమాలు ఊపందుకుంటాయని ఎక్సైజ్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News