- Advertisement -
సంగారెడ్డిః జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆందోల్ మండలంలోని అన్నసాగర్ చెరువు వద్ద ఆటోను ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడినవారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
One dead after RTC bus hit Auto in Sangareddy
- Advertisement -