Thursday, April 18, 2024

ఆటో బోల్తా: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

one death in road accident at Banswada

మద్నూర్: కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు వెళుతున్న ఆటో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యాదవ్ రావు అనే వ్యక్తి మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు మద్నూర్ ఎస్సై రాజు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మద్నూర్ సర్కార్ దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్సల కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. సమాచారం అందుకున్న బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. గాయపడిన వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

one death in road accident at Banswada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News