Thursday, April 25, 2024

చెట్టును ఢీకొట్టిన తుఫాన్ వాహనం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Death in Road Accident At Kothur

రంగారెడ్డి: చెట్టును ఢీకొని తుఫాన్ వాహనంలో ఒకరు మృతి చెంది పలువురికి గాయాలైన సంఘటన కొత్తూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ప్యాసింజర్స్‌ను తీసుకొని హైద్రాబాద్ నుండి మహబూబ్ నగర్ వెళ్తున్న తుఫాన్ వాహనం మార్గ మధ్యలో తిమ్మాపూర్ జాతీయ రహదారి పక్కన గల చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగర్‌కర్నూలు జిల్లా మల్కాపూర్ గ్రామానికి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంలోని పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

One Death in Road Accident At Kothur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News