అమరావతి: విశాఖలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఫార్మా కంపెనీలో ట్యాంకర్ పేలిన ప్రమాదంలో కాండ్రేగుల శ్రీనివాస్ (40) ప్రాణాలు కోల్పోయాడు. ఫార్మా కంపెనీలో రాత్రి విధుల్లోకి వెళ్లిన శ్రీనివాస్ ఆచూకీ కనిపించలేదు. సాల్వెంట్స్ ఫార్మా కంపెనీలో సీనియర్ కెమిస్ట్ గా శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ స్వస్థలం అనకాపల్లి మండలం రేబాక. అటు సాల్వెంట్ ఫార్మాసిటీ గేటు ఎదుట శ్రీనివాస్ కనిపించడం లేదంటూ బంధువులు ఆందోళన చేస్తున్నారు.
శ్రీనివాస్ ఆచూకీ తెలియజేయాలంటూ ఆర్డీవో కిషోర్ కు వినతి చేసినట్టు సమాచారం. కంపెనీ ఉద్యోగులతో శ్రీనివాస్ పై ఆరా ఆర్టీవో ఆరా తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని మరో కార్మికుడిని విశాఖ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. పరవాడ ఫార్మాసిటీలో నిన్న అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్దాలతో రసాయన ట్యాంకులు పేలాయి. ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన శ్రీనివాస్ మృతదేహం బయటపడింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
One Death in Visakhapatnam Ramky Pharma fire