Thursday, March 28, 2024

యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

 

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని వలిగొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేములకొండకి వెళ్లే దారిలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న బావిలోకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో కారులో ఇరుక్కుపోయిన ఇద్దరిని బయటకు తీశారు. అయితే, ఇందులో ఒకరు ప్రాణాలతో బయటపడగా.. మరోవ్యక్తి మృతి చెందాడు.  మృతుడిని చౌటుప్పల్‌ మండలంలోని అల్లందేవి చెరువుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

One died after Car rammed into well in Bhuvanagiri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News