Thursday, April 25, 2024

బైక్‌ను ఢీకొట్టిన బొలేరా: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జక్రాన్‌పల్లి: కామారెడ్డి జిల్లా జక్రాన్ పల్లి మండలంలోని మాదాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారి పైఐ బొలేరా జీపు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  మాక్లూర్ మండలం సట్లాపూర్ తాండాకు చెందిన సక్రియా నాయక్, రవి నాయక్ బైక్ పై ఆర్మూర్ వైపు నుంచి వచ్చి మాదాపూర్ ఎక్స్ రోడ్డు యూటర్న్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా డిచ్‌పల్లి వైపు నుంచి వస్తున్న బొలేరా జీప్ ఢీకొట్టిందన్నారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న రవి, సక్రియలు కిందపడడంతో సక్రియ నాయక్ (65) తలకు బలమైన దెబ్బ తగలడంతో సక్రియ అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్ నడుపున్న రవికి తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించామన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News