Thursday, April 18, 2024

ఆటో-డిసిఎం ఢీ: ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

one killed in auto-dcm collision at sangareddy

చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివంపేట శివారులో మంగళవారం రోడ్డుప్రమాదం సంభవించింది. ఆటో-డిసిఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను  చికిత్స నిమిత్తం సంగారెడ్డి సర్కార్ ఆస్పత్రికి తరలించారు. ఖాధీరాబాద్ గ్రామానికి చెందిన కాంతయ్య (65) హైదరాబాద్ లోని ఓ కాలేజీలో పనిచేస్తుండేవాడు. గురువారం సొంతపనుల నిమిత్తం తమ స్వగ్రామమైన ఖాదీరాబాద్‌కు ఆటోలో బయలుదేరాడు. శివంపేట మూలమలుపు వద్ద వేగంగా వచ్చి డిసిఎంను ఢీకొట్టాడు. దీంతో కాంతయ్య అక్కడికక్కడే చనిపోయాడు. అదే ఆటోలో ప్రయాణిస్తున్న లక్ష్మి, శ్రీనివాస్, శ్రీలక్ష్మితో పాటు మరో ప్రయాణికుడు గాయపడ్డాడని హైవే పెట్రోలింగ్ ఎస్‌ఐ అజీమోద్దీన్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

one killed in auto-dcm collision at sangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News