Friday, March 29, 2024

గుర్రపు బండిని ఢీకొట్టిన బైక్: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Road accident in Rajendranagar

హైదరాబాద్: గుర్రపు బండిని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చింతల్ మెట్ కు చెందిన  షేక్ జమీల్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తూ గుర్రపు బండిని ఢీకొట్టాడు. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జమీల్ అనే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోవడంతో తలకు బలమైన గాయాలు కావడంతో చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News