- Advertisement -
అమరావతి: లారీని ఓ ప్రవేటు బస్సు ఢీకొట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వైజంక్షన్ వద్ద గురువారం వేకువజామున జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒడిశాకు చెందిన 34 మంది వలస కూలీలు బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వీర్రాజు తెలిపాడు.
- Advertisement -