Saturday, April 20, 2024

ఎల్బీనగర్ వంతెనపై బైక్ ను ఢీకొట్టిన కారు…. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One member dead in Car hit bike in LB Nagar

హైదరాబాద్: ఎల్బీనగర్ వంతెన పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బైక్‌లను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలానగర్‌కు చెందిన ఉదయ్ రాజ్ అనే యువకుడు తన బంధువైన అనుషకు డిగ్రీ పరీక్షల కోసం ఎగ్జామ్ సెంటర్ తీసుకెళ్లాడు. పరీక్ష ముగిసిన తరువాత సంఘీ టెంపుల్‌కు వెళ్లి దేవుడిని దర్శించుకొని ఇంటికి వస్తుండగా ఎల్‌బి నగర్ బ్రిడ్జిపై ఉదయ్ బైక్‌ను కారు ఢీకొట్టడంతో 20 అడుగుల పైకి ఎగిరి కిందపడ్డాడు. కారు మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో అనూష తీవ్రంగా గాయపడడంతో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయ్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. క్షతగాత్రులు మెడిసిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News