Thursday, April 18, 2024

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Young Man Died In Road Accident At Khammam

ఖమ్మం: తెలంగాణలో ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బుధవారం ఉదయం వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందారు. ఖమ్మం జిల్లాలోని అర్బన్ పార్కు మూలమలుపు వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సు, లారీని ఓవర్ టేక్ చేస్తుండగా అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శివారులో స్పిన్నింగ్ మిల్లు వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే చనిపోయాడు. మృతుడు భువనగిరి పట్టణానికి చెందిన వాసం భాను(24)గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News