- Advertisement -
ఖమ్మం: బైక్ ను కారు ఢీకొట్టిన సంఘటన ఖమ్మంలోని మయూరి బ్రిడ్జిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెంతెన పైనుంచి వెళ్తున్న కారు అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టడంతో యువకుడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. మృతుడు నాయుడు పేటకు చెందిన సంపత్ గా(24) గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -