Thursday, April 18, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -


మన తెలంగాణ/భిక్కనూర్ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో బైక్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన మ్యాదరి కుమార్ (30) ఆదివారం రాత్రి 10:45 గం॥లకు ద్విచక్రవాహనం పై స్థానిక మెడిసిన్ కంపెనీలో పని ముగించుకొని మండల కేంద్రానికి వస్తూ పెద్దమల్లారెడ్డి రోడ్డు వద్ద ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న కల్వర్టును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కుమార్‌కు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పరిశీలించారు. ఈ మేరకు శవాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News