Friday, April 26, 2024

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/చేగుంట. బురుదలో దిగబడిన ట్రాక్టర్‌ను బయటకు తీయబోయి అదే వాహనం కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట పోలీస్‌స్టేషన్ పరిదిలోని నాగ్‌సాన్‌పల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…  కుక్కదుల స్వామి (34) తన వ్యవసాయ పొలం వద్ద భార్య అనితతో కలసి పనులు చేసుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి అనే వ్యక్తి తన పొలంలో ట్రాక్టర్ దిగిబడింది దానిని బయటకు తీయడానికి రావాలని స్వామికి పోన్ చేసాడు. భార్య అనిత కు చెప్పి ముత్యంరెడ్డి పొలం వద్దకు వెళ్లి ట్రాక్టర్‌ను బురదలో నుంచి బయటకు తీయబోతూ అతివేగంపాటు అజాగ్రత్తగా నడిపి గెట్టు ఎక్కించబోయి ట్రాక్టర్ బోల్తా కొట్టింది. అదే ట్రాక్టర్ కింద స్వామి పడిపోయి చాతీ మరియు కాళ్లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ సుభాష్‌గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News