Friday, April 26, 2024

ఉప్పల్ లోని అంజనేయ స్వామి గుడిలోకి దూసుకెళ్లిన డిసిఎం, లారీ

- Advertisement -
- Advertisement -

 

ఉప్పల్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం హబ్సిగూడలోని జెన్ ప్యాక్ట్ సమీపంలో శుక్రవారం  తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపు తప్పి డిసిఎం ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. దీంతో లారీ, డిసిఎం రోడ్డుపై ఉన్న అంజనేయ స్వామి దేవాలయంలో దూసుకెళ్లాయి. వెనక నుంచి లారీని టాటా ఎస్ ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను పక్కకు తొలగిస్తున్నారు. ఉప్పల్-సికింద్రాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News