రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరి మృతి… పలువురికి గాయాలు
మన తెలంగాణ/బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల పరిధిలోని రాజుల్ల గ్రామ శివారు ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. టివిఎస్ చాంప్, స్ప్లెండర్ బైక్లు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాలైనట్లు బిచ్కుంద ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు…. మంగళవారం సాయంత్రం సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో తన ద్విచక్ర వాహనం అయిన టివిఎస్ చాంప్ పై డోంగ్లి గ్రామానికి చెందిన వ్యక్తి అయినటువంటి విఠల్ తంఢ్రి లాలు (50), డోంగ్లి తన టివిఎస్ చాంప్ పై బిచ్కుంద మండలంలోని రాజుల్ల గ్రామం నుండి డోంగ్లి వెళ్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న మోటర్ సైకిల్ హీరో స్ప్లెండర్ పై ప్రయాణిస్తున్న ఎరుకల రాములు అతివేగంగా అజాగ్రత్తగా నడిపి టివిఎస్ ఎక్సెల్ను ఢీకొట్టిన ఈ క్రమంలో మృతుడు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు బిచ్కుంద ఎస్సై సాయన్న తెలిపారు.